ఏపీలోని అర్చకులకు జీతం 20 శాతం పెంపు

-

ఏపీలోని అర్చకులకు జీతం 20 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రకటించారు. దేవాదాయ శాఖ పై ముఖ్యమంత్రి జగన్‌ ఇవాళ సమగ్రంగా సమీక్షించారని తెలిపారు గతంలో ఎప్పుడూ ముఖ్యమంత్రులు సమీక్షించిన దాఖలా లేదని… వంశపారం పర్యంగా అర్చకుల నియామకం ఉంటుందన్నారు. ఆన్లైన్ విధానం ద్వారా మోసాలకు అవకాశం లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సూచించారని వెల్లడించారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.

దేవాదాయ శాఖ భూముల సర్వే కూడా చేపట్టనున్నట్లు స్పష్టం చేశారు మంత్రి వెల్లపంల్లి. విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ వింగ్ కు ఒక ఐపీఎస్ అధికారి నేతృత్వంలో పర్యవేక్షించాలని సీఎం జగన్‌ ఆదేశించారన్నారు. దసరా నవరాత్రులు, బ్రహ్మొత్సవాలు వస్తున్నాయని…ఈ నేపథ్యం లోనే ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డికి ఆహ్వానం అందించామని తెలిపారు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి వైైసిపి పార్టీ తోనే సాధ్యం అని పేర్కొన్నారు మంత్రి వెల్లంపల్లి.

Read more RELATED
Recommended to you

Latest news