మెగా కోడలితో సమంత దీవాళి సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌ !

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత తెలుగు లో ఏమాయ చేశావే సినిమాతో పరిచయమై కుర్ర కారును తనదైన మాయలో పడేసింది. ఆ సినిమా లో అక్కినేని నాగ చైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకుని తెలుగింటి కోడలైయ్యారు. అయితే… నాలుగేళ తర్వాత ఇటీవల… సమంత… నాగ చైతన్యకు విడాకులు ఇచ్చి అందరికీ షాక్‌ ఇచ్చారు.

తమ నాలుగేళ్ల బంధానికి స్వస్థి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్‌ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక అప్పటి నుంచి సమంతపై అక్కినేని ఫ్యాన్స్ సీరియస్‌ గా ఉన్నారు. అయితే.. తాజాగా సమంత.. మెగా కోడలు ఉపాసనను కలిసింది. నిన్న రోజున దీపావళి పర్వదినం నేపథ్యంలో… ఉపాసనతో దీవాళి సెలబ్రేషన్స్‌ జరుపుకుంది సమంత. ఉపాసన తో పాటు తన బెస్ట్‌ శిల్ప రెడ్డి తో కూడా దీవాళి సెలబ్రేషన్స్‌ చేసుకుంది సమంత. అయితే.. వీరితో దిగిన ఫోటోలను సమంత తన ఇన్‌స్టాంగ్రామ్‌ లో షేర్‌ చేసింది. దీంతో ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news