ఒవైసీకి సంజయ్ సవాల్.. సమాధులను దమ్ముంటే కూల్చరా !

-

గ్రేటర్ పోరు తీవ్రం అవుతుంది. ఒకరిమీద ఒకరు ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే పీవీ, ఎన్టీఆర్ సమాధులను కూల్చాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ కామెంట్ చేయడంతో దానికి బండి సంజయ్ ఘాటైన కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్, పీవీ సమాధులను కూలుస్తా అన్నాడట ఓవైసీ, దమ్ముంటే కూల్చరా… నీ దారుసలాం భవనాన్ని క్షణాల్లో కాల్చేస్తారు మా కార్యకర్తలు అంటూ ఆయన కామెంట్ చేశారు. ఢిల్లీ పార్టీ బీజేపీ అని ఒకడు అంటున్నాడు, మీది గల్లీ పార్టీ.. గడీల పార్టీ పార్టీ అంటూ కేటీఆర్ కామెంట్స్ కు ఆయన కౌంటర్ ఇచ్చారు. ఢిల్లీ పార్టీ అయినా… గల్లీ గల్లీకి ప్రధాన మంత్రి పథకాలు చేరువయ్యాయని అన్నారు.

టీఆర్ఎస్ ని సవాల్ చేస్తున్న…నిజంగా మీది లోకల్ పార్టీ అయితే… కేంద్ర ప్రభుత్వ నిధులు రాకుండా ఏం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. నా దొంగ సంతకం పెట్టి.. 10 వేల పంపిణీని అడ్డుకున్న పాస్పోర్ట్ బ్రోకర్ కేసీఆర్ అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎల్ ఆర్ ఎస్ పోవాలంటే.. టీఆర్ఎస్ పోవాలి, టీఆర్ఎస్ పోవాలంటే బీజేపీ రావాలని ఆయన అన్నారు. ప్రతి పైసా కేంద్రం ఇస్తోంది.. పేర్లు మార్చి, ఫొటోస్ మార్చి.. తన పథకాలుగా చెప్పుకుంటున్నాడని అయన అన్నారు. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ జరిగితే.. ఇండియా గెలవాలి కానీ పాకిస్థాన్ గెలవాలి అన్నోడిని తరిమికొట్టాలా లేదా అంటూ ఆయన ప్రశ్నించారు. పాకిస్థాన్ గెలవాలి అని జెండాలు పట్టుకుని తిరిగే లుచ్చాలు.. ఓల్డ్ సిటీలో ఉన్నారని వాళ్ళందరిని తరిమి కొట్టాలా లేదా అని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news