ఆ రికార్డు సృష్టించిన మహేశ్ బాబు, పవన్ కల్యాణ్

-

టాలీవుడ్​లో అతిపెద్ద ఫ్యాన్ బేస్ ఉన్న హీరోల్లో నంబర్ వన్ ప్లేస్ కోసం టఫ్ పోటీ ఉండేది పవర్ స్టార్ పవన్ కల్యాణ్, సూపర్ మహేశ్ బాబు ఫ్యాన్ బేస్​కే. అంతటి స్టార్​డమ్ సంపాదించుకున్న మహేశ్, పవన్​లు ఒక అరుదైన రికార్డు సృష్టించారు.


సూపర్​ స్టార్​ మహేశ్‌బాబు ఇటీవలే ‘సర్కారు వారి పాట’తో సందడి చేశారు. తెలుగులోనే విడుదలైన ఈ చిత్రం దేశవ్యాప్తంగా 155కోట్ల వసూళ్లను సాధించింది. ఇక పవన్‌ కల్యాణ్‌ ‘భీమ్లా నాయక్‌’ సైతం 132 కోట్ల వసూళ్లను అందుకుంది. అయితే ఇప్పుడీ రెండు సినిమాలు ఓ రికార్డును అందుకున్నాయి.


ఈ ఏడాదిలో ఇప్పటివరకు విడుదలై, అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలను పరిశీలిస్తే.. ఈ రెండు చిత్రాలు దేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో టాప్​-10లో నిలిచాయి. ఈ జాబితాలో ఈ రెండు సినిమాలు మాత్రమే ఏకభాషలో విడుదలై 100కోట్లకు పైగా వసూళ్లను సాధించాయి. అత్యధిక కలెక్షన్లు సాధించిన ప్రాంతీయ భాషా చిత్రాలుగా పాన్‌ ఇండియా చిత్రాల సరసన నిలబడ్డాయి. మిగతా చిత్రాలన్నీ పాన్‌ఇండియా రిలీజ్‌, పాన్‌ ఇండియా సినిమాలుగానే ఆ మార్కును అందుకోవటం గమనార్హం.


అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో ‘సర్కారు వారి పాట’ ఎనిమిదో స్థానంలో నిలిస్తే, ‘భీమ్లా నాయక్‌’ పదో స్థానం సాధించింది. కేవలం ఒక భాషలోనే సినిమా విడుదలై 100కోట్ల వసూళ్లు సాధించే స్టామినా ఉన్నా హీరోలుగా మహేశ్‌బాబు, పవన్‌ కల్యాణ్‌ నిలిచారు. ఈ రికార్డుతో టాలీవుడ్​ మరో మెట్టు ఎక్కిందనే చెప్పాలి. కాగా, ఇప్పటివరకూ పవన్​, మహేశ్​.. ఇద్దరూ పాన్‌ ఇండియా సినిమా చేయకపోవడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news