హోమ్ లోన్ తీసుకుంటున్న వారికి ఎస్బీఐ భారీ షాక్..!

-

ప్రముఖ వాణిజ్య బ్యాంక్ ఎస్బీఐ కొత్త పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే..ప్రభుత్వ శాఖ అయిన ఈ బ్యాంక్ ఇప్పటికే ఖాతాదారులకు కొత్త బెనిఫిట్స్ ను అందిస్తుంది..కొన్నిటిని మాత్రం షాక్ ఇస్తుంది.మొన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ పై వడ్డీ రేట్లను తగ్గించింది. ఇప్పుడు మరో భారీ షాక్ ను ఇస్తుంది..హోమ్ లోన్ కొత్తగా తీసుకొనేవారికి భారీ షాక్ ఇస్తుంది. గతంలో పెంచిన వడ్డీ రేట్లను ఇప్పుడు ఇంకాస్త పెంచింది.

ఈ విషయం పై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.గృహ రుణాలు తీసుకున్న వారికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షాకిచ్చింది. వడ్డీ రేట్లను ఏకంగా అర శాతం పెంచుతున్నట్టు ప్రకటించింది.బెంచ్ మార్క్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు పెంచి 7.5 శాతం చేసినట్టు ఎస్బీఐ తెలిపింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.65 శాతం, దీనికి అదనంగా క్రెడిట్ రిస్క్ ప్రీమియం ఉంటుందని పేర్కొంది. నూతన రేట్లు జూన్ 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.

ఇప్పటి వరకు ఎక్స్ టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటు 6.65 శాతంగా, రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.25 శాతంగా ఉన్నాయి. వీటికి క్రెడిట్ రిస్క్ రూపంలో కొంత శాతాన్ని కలిపి రుణాలపై రేట్లను ఎస్బీఐ అమలు చేస్తుంటుంది. ఆర్బీఐ కీలక రేట్లను సవరించినప్పుడల్లా రుణాలపై రేట్లను బ్యాంకులు సైతం సవరిస్తుంటాయి. ఇటీవలే రెపో రేటును 0.40 శాతం మేర ఆర్బీఐ సవరించడం తెలిసిందే. దీనికంటే మరో 0.10 శాతం అదనంగా ఎస్బీఐ రుణ రేట్లను పెంచడం గమనార్హం..ఇక ముందు వేటి పై వడ్డీ రేట్లను పెంచుతుందో చూడాలి..

Read more RELATED
Recommended to you

Latest news