Nalgonda : ప‌ట్టించుకునే నాదుడే లేడా..? ఇనుపాముల ఎస్సీ కాలనీ ఇంటి నుంచి వచ్చే మురుగునీటిని ఆపేసిన రైతులు..!

-

నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఆ గ్రామానికి చెందిన దళితులు, అగ్రకుల శక్తుల మధ్య మురుగుకాలువ విషయంలో గొడవ ప్రారంభమైంది. ఇప్పుడు కాదు గత 30 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో ఉన్న ఎస్సీ కాలనీ లో ఉన్న ఇళ్లలో నుంచి వచ్చే మురుగు నీరు పక్కనే ఉన్న పొలాల్లో కి వెళుతుంది. అది తాతల కాలం నుంచి జరుగుతూనే ఉంది. ఆ గ్రామంలో ఉన్న సుమారు 150 పిల్ల నుంచి వచ్చే వాడు కుండ నీళ్లు మరియు మురుగు నీళ్లు పక్కనే ఉన్న పొలాలకు వెళ్తున్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఎప్పుడూ ఆవు మురికిని దాన్ని ఎవరు ఆపలేరు అడగట్లేదు.

 

కానీ తాజాగా ఎస్సీ కాలనీ నుంచి పొలాల్లోకి వెళ్లి మురుగు నీటిని… ఆ పొలాలకు చెందిన యజమానులు ఆపేసినట్టు ఆ గ్రామ దళితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ పొలాలన్నీ రెడ్డి కాలానికి చెందిన వారవని… వాళ్లు ఆ నీళ్ళు పోకుండా గోడ కట్టుకున్నారని దీనివల్ల మురుగునీరు ఇళ్లవద్ద దోమలు చేరుతున్నాయి అని అంటున్నారు. దీనివల్ల పిల్లలకు డెంగ్యూ మరియు మలేరియా లాంటి రోగాలు వస్తున్నాయి అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయంపై సర్పంచ్, వార్డు మెంబర్లు, ఎంపీటీసీలు ఎవరు ఈ విషయంపై పట్టించుకోవడంలేదని… అదే గ్రామానికి చెందిన దళిత యువకుడు శోభన్ బాబు మరియు ఎస్సీ కాలనీ యువకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మురుగు నీరు వెళ్లకుండా రెడ్డి కులస్తులు… చుట్టు గోడ కట్టించుకుని దళితుల ఇళ్లలో నుంచి మురుగునీరు రాకుండా అడ్డుకట్ట వేసి దళితుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు సకాలంలో స్పందించి మురుగు కాలువ నుంచి నీళ్లు వెళ్లిపోయేలా చూడాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news