రాష్ట్రం విడిపోవడానికి కారణం చంద్రబాబే.. మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు

-

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, ఏపీగా  విడిపోవడంపై మంత్రి ఆర్.కే. రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం మంత్రి రోజా చిత్తూరు జిల్లా పుత్తూరులో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. నగరి నియోజకవర్గంలో గెలిచి హ్యాట్రిక్ సాధిస్తా అని ధీమా వ్యక్తం చేశారు. కేవలం టీడీపీ అధినేత చంద్రబాబు కారణంగా రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు లాంటి మోసకారి ప్రపంచంలో ఎవరూ ఉండరని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

మళ్లీ మోసగాళ్ల చేతిలో రాష్ట్రాన్ని పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా లేరని అన్నారు. వాళ్లకు ఓటేస్తే మళ్లీ కష్టాలు మొదలవడం ఖాయమని తెలిపారు. మరోసారి వైసీపీ ప్రభుత్వమే రాబోతోందని చెప్పారు. టీడీపీ, జనసేన కూటమికి జనసేనకు ప్రకటించినన్ని సీట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. తాము 175 కు 175 స్థానాల్లో గెలిచేందుకు కృషి చేస్తామని అన్నారు. ఓటమి తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కనిపించరని అన్నారు. వాళ్లిద్దరు హైదరాబాద్ కే పరిమితం అవుతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news