మదనపల్లె అక్కా చెల్లెళ్ళ హత్య.. విస్తుపోయే నిజాలు వెల్లడించిన పోలీసులు !

-

మదనపల్లెలో అక్కాచెల్లెళ్లను దారుణంగా చంపిన కేసులో  పోలీసులు అనేక విస్తుపోయే అంశాలను వెల్లడించారు. స్పిరిచువల్ గా ఈ కుటుంబం చాలా దూరం వెళ్లి పోయిందని దేవుడు, చావు అనే విషయాలను మీరు బాగా నమ్మారని పోలీసులు చెబుతున్నారు. కరోనా లాక్ డౌన్ మొదలైన నాటి నుంచి ఈ కుటుంబం అంతా బయటకు రావడం కూడా దాదాపుగా తగ్గించేసింది అని పోలీసులు గుర్తించారు. ఇంట్లో పని చేసే వారు సైతం బయటి నుంచి వచ్చి బయటే పని చేసుకుని వెళ్లి పోవాల్సి వచ్చేదని వారు గుర్తించారు. మీరు చనిపోయినా మేము బతికి ఇస్తామని చెప్పి ముందుగా చిన్న కూతురిని శూలంతో పొడిచి చంపినట్లు పోలీసులు గుర్తించారు.

అనంతరం పెద్ద కూతురికి సగం గుండు కొట్టించి నోటిలో రాగిచెంబు పెట్టి తల మీద డంబెల్స్ తో మోది చంపినట్లు గుర్తించారు. అనంతరం వీరి నగ్న దేహాలతో తల్లిదండ్రులు పూజలు చేశారని చెబుతున్నారు. అయితే పోలీసులు వచ్చి వీరిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించినా వారు పోలీసుల మీద ఎదురు తిరిగినట్లు సమాచారం. మీరు ట్రేస్ పాసింగ్ చేశారని  కేసులు పెడతామని వారు బెదిరించారని అంటున్నారు. వారం రోజుల క్రితం ఈ ఇంటిలో ప్రత్యేక పూజలు జరిగాయని ఈ పూజలకు ఎవరైనా బయట వాళ్ళు వచ్చి వెళ్లారా అనే అంశాన్ని పరిశీలిస్తామని పోలీసులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news