ఏపీలో నిలిపివేసిన న్యూస్ ఛానల్ ప్రసారాలపై ఢిల్లీ హై కోర్టు సంచలన తీర్పు..!

-

ఆంధప్రదేశ్ లో కొన్ని వార్తా ప్రసార మాధ్యమాలు వైసీపీ భజన చేస్తూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్నాయని ఆరోపిస్తూ కేబుల్ ఆపరేటర్స్ కొన్ని ఛానెల్స్ ప్రసారాలను నిలిపివేసిన విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా నిలిపివేసిన న్యూస్ ఛానెల్స్ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలి ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

డిల్లీ హైకోర్టు ఆదేశాలపై NBF హర్షం వ్యక్తం చేసింది. అలాగే ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ఛానెల్స్ ప్రసారాలను నిలిపివేయడం చట్ట విరుద్ధం అని NBF పేర్కొంది. భవిష్యత్ లో కూడా ఛానెల్స్ ప్రసారాలను అడ్డుకోకుండా ప్రభుత్వాలు, నియంత్రణా సంస్థలు చర్యలు తీసుకోవాలని NBF కోరింది. వైసీపీ అధికారంలోకి వస్తే.. కొన్ని ఛానల్స్ ని బ్యాన్ చేయడం.. టీడీపీ అధికారంలోకి వస్తే.. కొన్ని ఛానెల్స్ ని బ్యాన్ చేయడం ఏపీలో  ఈ తంతు కొనసాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news