సెప్టెంబర్ 2న జరగాల్సిన పరీక్ష వాయిదా!

-

తెలంగాణలో సెప్టెంబర్ 2న టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో జరగాల్సిన అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ పరీక్ష వాయిదా వేస్తున్నట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. అదే రోజున భారీగా నిర్వహించనున్న ప్రగతి నివేదన సభ ఉండటం వల్ల పరీక్షకు హాజరయ్యేవారికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండటం వల్ల పరీక్షను వాయిదా వేశారు. 474 మండల ప్లానింగ్ అండ్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ ను టీఎస్పీఎస్సీ గత జూన్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. పరీక్షను సెప్టెంబర్ 3 న నిర్వహించనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news