Serbia: కిషన్ రెడ్డికి సెర్బియా ఆహ్వానం…

-

సెర్బియా పర్యటనకు రావాల్సిందిగా భారత పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది. ఈఏడాది 45వ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ జరగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్‌గ్రేడ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది . ఈ మేరకు సెర్బియా పర్యాటక శాఖ మంత్రి శ్రీ హుసేన్ మెమిక్ ఆహ్వాన పత్రాన్ని పంపించారు.

 

యూరప్, సెర్బియా ప్రాంతంలో పర్యాటక రంగములో జరిగే అతిపెద్ద ఈవెంట్ ఇది.గత 30 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతోండగా.. ఈసారి ‘అడ్వెంచర్ బిగిన్స్ హియర్’ అనే థీమ్ తో ఈ ఇంటర్నేషనల్ టూరిజం ఫెయిర్ జరగనుంది. వివిధ దేశాలనుంచి పర్యాటక శాఖల మంత్రులతో పాటు ఈ రంగానికి సంబంధించిన భాగస్వామ్య పక్షాలు, ఇన్వెస్టర్లు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news