ఝార్ఖండ్​లో ఘోర ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

-

ఝార్ఖండ్​ సరాయ్​కేలాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఛాయ్​భాసాలో కూలీలతో వెళ్తున్న ఓ పికప్ వ్యాన్ రోడ్డుపై బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు దుర్మరణం చెందారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో వ్యాన్​లో 25 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది.

స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ప్రమాదానికి గల కారణం అతివేగమేనని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news