వీర సింహారెడ్డి ఓటిటిలో వచ్చేది అప్పుడే..!

-

నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా.. స్టార్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా తాజాగా తెరకెక్కించిన చిత్రం వీరసింహారెడ్డి . సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన చాలా గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. మొదటి షో తోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ సినిమా యూఎస్ లో కూడా ప్రీమియర్ షో తో సందడి చేస్తోంది. అక్కడ భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా మాస్ టాక్ తెచ్చుకున్నట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో కూడా గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఎప్పుడెప్పుడా అని అభిమానులు ఎదురు చూస్తుండగా ఎట్టకేలకు సినిమాను రిలీజ్ చేసి వారి ఆత్రుతకు తెరదించారు.

సంక్రాంతికి పక్క మాస్ సినిమాతో వచ్చిన బాలయ్య మరోసారి థియేటర్స్ వద్ద మాస్ జాతర చేయనున్నాడు. ఇదిలా ఉండగా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటిటి హక్కులను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కొనుగోలు చేసినట్లు కన్ఫామ్ అయ్యింది. మరి ఈసారి బాలయ్య వీరసింహారెడ్డి సినిమా హక్కులను కొనుగోలు చేసిన సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అని సమాచారం. బాలయ్య నటించిన గత సినిమా అఖండ ఓటిటి రైట్స్ కూడా వీరే కొనుగోలు చేశారు ఇప్పుడు ఈ మాస్ ఎంటర్టైనర్ కూడా ఈ ప్రముఖ ప్లాట్ఫామ్ కొనుగోలు చేయడం గమనార్హం. సినిమా విడుదలైన ఎనిమిది వారాల తరువాతే ఓటీటీ లోకి వచ్చే అవకాశం ఉంది.

దీంతో ఈసారి వీర సింహారెడ్డి ఎంట్రీ కూడా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనే ఉండనుంది అని తెలుస్తోంది. అయితే ఓటీటీ రైట్స్ ను భారీ రేటుకే దక్కించుకున్నట్లు సమాచారం. ఇందులో కీలకపాత్రలో విజయ్ దునియా, వరలక్ష్మీ శరత్ కుమార్ నటిస్తున్నారు. సిస్టర్ సెంటిమెంట్ తో వచ్చిన ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news