లోదుస్తుల వివాదం.. ఏడుగురికి బెయిల్ మంజూరు

-

నీట్ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ఏడుగురు నిందితులను సుప్రీంకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. కేరళలో కొల్లాంలోని ఓ పరీక్షా కేంద్రం వద్ద విద్యార్థినుల లోదుస్తువులు విప్పేయాలని కళాశాల సిబ్బంది బలవంతం చేసింది. దీంతో కొందరు విద్యార్థినులు ఈ నిబంధనను వ్యతిరేకించారు. తల్లిదండ్రుల సాయంలో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు ఏడుగురు కళాశాల సిబ్బందిని అరెస్ట్ చేసింది.

కేరళ పరీక్షా కేంద్రం
కేరళ పరీక్షా కేంద్రం

ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రులు మాట్లాడుతూ.. పరీక్షలు రాయనివ్వకుండా తమ పిల్లలను మానసికంగా ఇబ్బంది పెట్టారన్నారు. నీట్ పరీక్ష రాయడానికి వెళ్తే కళాశాల సిబ్బంది లోదుస్తువులు విప్పేసి.. స్టోర్ రూమ్‌లో పడేయమని చెప్పారని వారు పేర్కొన్నారు. దాదాపు 90 శాతం విద్యార్థినుల చేత బలవంతంగా లోదుస్తువులు విప్పించారని ఆరోపించారు. దీని వల్ల విద్యార్థినులు అసలు పరీక్షే రాలేకపోయారన్నారు. కళాశాల సిబ్బంది ఎంతో దురుసుగా ప్రవర్తించిందని.. నీకేది ఇంపార్టెంట్.. నీ భవిష్యతా? లేక నీ లోదుస్తువులా? అని బెదిరించారని వారు పేర్కొన్నారు. అయితే ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం, జాతీయ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లడంతో భారీ ఎత్తున ఆందోళనలు జరిగాయి.

Read more RELATED
Recommended to you

Latest news