టాలీవుడ్‌ వారసత్వ హీరోలపై సమంత సీరియస్‌ ?

-

టాలీవుడ్‌ హీరోయిన్‌ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే.. తాజాగా బాలీవుడ్ లో కాఫీ విత్ కరణ్ షో లో పాల్గొన్నది సమంత. అందులో అక్షయ్ కుమార్ తో కలిసి సందడి చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను కూడా తెలియజేసినట్లు తెలుస్తోంది. ఇక నాగచైతన్య గురించి, విడాకుల గురించి, పలు ప్రశ్నలకు సమాధానం తెలిపినట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో టాలీవుడ్‌ వారసత్వ హీరోలపై సమంత సంచలన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం అందుతోంది. టాలీవుడ్‌ లో హీరోలు కొడుకులు లేదా, వారి బంధువుల కొడుకులు హీరోలు అవుతున్నారని ఆమె పేర్కొందట. ఇలాంటి నేపథ్యంలో విజయ్‌ దేవర కొండ అగ్రహీరోగా ఎదగడం చాలా గ్రేట్‌, అరుదు అని ఆమె ప్రసంశలు కురిపించిందట. సమంత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్‌ టాపిక్‌ గా మారాయి. కాగా.. విజయ్‌ దేవరకొండ, సమంత ఇద్దరూ కలిసి ఖుషీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news