కరోనా రోగికి తీవ్ర గాయాలు.. చికిత్స చేసిన ఎమ్మెల్యే

-

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభన అత్యధిక స్థాయిలో ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది రోగులు కరోనా నిర్ధారణ అయిన ప్పటికీ ఇంటి దగ్గర ఉండి చికిత్స పొందుతున్నారు. ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళు హోమ్ ఐసోలేషన్ లో ఉంటూ డాక్టర్లను ఇంటి వద్దకు పిలిపించుకుని వైద్యం చేయించుకుంటున్నారు. మరి ఆర్థిక స్తోమత లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి..? ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి కాలు విరిగి వైద్యం చేయించుకోవడానికి అనేక ఆసుపత్రుల చుట్టూ తిరిగాడు ఈ గ్రామంలో అతనికి కరోనా సోకింది.

అయితే ఇంటి దగ్గర ఉండి వైద్యం చేయించుకోవడానికి అతనికి అంత ఆర్థిక స్తోమత లేక ఇంటి వద్దే కుమిలిపోతూ ఉన్నాడు.ఈ విషయం తెలుసుకున్న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రోగి ఇంటి వద్దకు వెళ్లారు. వృత్తి రీత్యా ఎమ్మెల్యే వైద్యులు కావడంతో రోగికి స్వయంగా తానే చికిత్స అందజేశారు. ఈ విషయం తెలిసిన మంత్రి కేటీఆర్ ఎమ్మెల్యే ను అభినందించారు.

Read more RELATED
Recommended to you

Latest news