వీళ్ళు కలెక్టర్లు కాదు చెంచాలు..పొద్దున్నే కేసీఆర్‌ కు పూజలు చేయాలి : షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు

-

తెలంగాణ రాష్ట్రంలోని అధికారులు కలెక్టర్లు లు కాదని… అందరూ చెంచాలంటూ మాజీ మంత్రి షబ్బీర్ అలీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు సార్లు కలెక్టర్ గా ఉండి కేసీఆర్ కాళ్ళు మొక్కిన వ్యక్తి వెంకట్ రామ్ రెడ్డి అని.. జిల్లా మెజిస్ట్రేట్ కాళ్ళు మొక్కి ఏం సంకేతాలు ఇచ్చారని ఫైర్‌ అయ్యారు. కింది స్థాయి అధికారులకు మొక్కమని సంకేతాలు ఇచ్చారని నిప్పులు చెరిగారు.

సిద్దిపేట మాజీ కలెక్టర్‌ పై కేంద్రానికి, రాష్ట్రపతికి పిర్యాదు చేశామన్నారు. చర్యలు తీసుకోవాలని చెప్పినా చర్యలు తీసుకోలేదని… అధికారులంతా… పొద్దున్నే దేవుడిని పూజ చేసినట్లు కేసీఆర్ బజన చేయాల్సిందేనని మండి పడ్డారు. రాజకీయ కరెప్షన్ కోసం కేసీఆర్ వెంకట్ రామ్ రెడ్డినీ తీసుకొచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు షబ్బీర్‌ అలీ. లీగల్ గా చర్యలు తీసుకొనేలా కాంగ్రెస్ పార్టీ ఒత్తిడి తీసుకు రాబోతుందని స్పష్టం చేశారు మాజీ మంత్రి షబ్బీర్ అలీ. టీఆర్‌ఎస్‌ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేస్తుందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news