షేర్ చాట్ వీడియో బాలుడి ప్రాణం తీసింది..!

-

ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్రభావం జనాల పై ఎక్కువగా పెరిగిపోవడమే కాదు సోషల్ మీడియా కారణంగా ఎన్నో అనర్థాలు కూడా జరుగుతున్న విషయం తెలిసిందే. రోజు రోజుకి సోషల్ మీడియాకు బానిసలుగా మారిపోతున్నారు ఎంతోమంది… సోషల్ మీడియా పేరుతో ఎన్నో దారుణాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇటీవల కాలంలో టిక్ టాక్ అనే ఎంటర్టైన్మెంట్ యాప్ లో ఎంతో మంది లైకుల కోసం వివిధ రకాలుగా స్కిట్ చేసి చివరికి ప్రాణాలమీదికి తెచ్చుకోవడం.. కొంత మంది ప్రాణాలు కోల్పోవడం లాంటివి కూడా జరిగాయి. ఇక ఇప్పుడు ఇక్కడ ఇలాంటి ఘటనే జరిగింది.

షేర్ చాట్ లో ఒక వీడియో తీయాలనే ఆలోచన ఒక బాలుడిని హత్య చేసేంత వరకూ వెళ్లింది. ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది షామీర్పేట్. షామీర్పేట్ లో నివాసముండే బీహార్ వాసి సుదర్శన్ శర్మ అయిదేళ్ల బాలుడిని షేర్ చాట్ లో స్కిట్ కోసం తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే ప్రమాదకరమైన స్టంట్ చేస్తున్న సమయంలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయం బాలుడి తల్లిదండ్రులకు తెలిస్తే తన పై దాడి చేస్తారేమో అన్న భయం తో ఏకంగా బాలుడిని కత్తితో పొడిచి దారుణంగా హత్య చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news