బిఆర్ఎస్ నేతలపై జాతీయ మహిళా కమిషన్ కు షర్మిల ఫిర్యాదు

-

ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్ ని కలిశారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. బిఆర్ఎస్ నేతలపై ఆమె ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అసభ్య దూషణకు దిగిన బీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు. తనను అసభ్య పదజాలంతో దూషించారని, అందుకు సంబంధించిన వీడియోలను కూడా కమిషన్ ముందు ఉంచారు.

అసభ్య పదజాలంతో పాటు దాడులకు, హెచ్చరికలకు దిగిన వారి పైన చర్యలు తీసుకోవాలని కోరారు. బిఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మహిళలు అంటే గౌరవం లేదన్నారు షర్మిల. దీంతో షర్మిలను దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని మహిళా కమిషన్ హామీ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news