“పాలేరు” టికెట్ కోసం “షర్మిల – తుమ్మల” మధ్య పోటీ … !

-

తెలంగాణాలో కాంగ్రెస్ బలం రోజు రోజుకి పెరుగుతూ ఉంది. అధికార BRS నుండి బయటకు వచ్చేసిన తుమ్మల నాగేశ్వరరావు కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖరారు అయిన తరుణంలో గతంలో ఈయన ఎమ్మెల్యే గా గెలిచిన పాలేరు నియోజకవర్గం నుండి పోటీ చేయడానికి ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇక YSRTP నుండి కాంగ్రెస్ లోకి వస్తున్న షర్మిల కూడా ఇదే స్థానం నుండి ఎన్నికల్లో పోటీ చేయాలనీ ఇంతకు ముందే చెప్పి ఉన్నారు, కానీ ఇద్దరు నాయకులు ఒకే గూటికి చేరుతారు అని ఊహించకపోవడం వలన ఇప్పుడు సందిగ్దత నెలకొంది. ఇప్పుడు ఈ సీటు పైన తుది నిర్ణయాన్ని కర్ణాటక డిప్యూటీ సీఎం గా ఉన్న డీకే శివ కుమార్ కు కాంగ్రెస్ అధిష్టానం అప్పగించినట్లు తెలుస్తోంది.

మరి డీకే శివ కుమార్ ఎవరిని ఈ సీటుకు కేటాయించనున్నారు ? మరియు ఏ ప్రాతిపదికన అన్నది తెలియాల్సి ఉంది. వాస్తవంగా చూస్తే షర్మిలను వేరే స్థానానికి పరిమితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news