కింగ్ షారుక్ ఖాన్ సినిమా 700 కోట్ల క్లబ్ లో.!

-

షారూఖ్ ఖాన్ నటించిన పఠాన్ బాక్సాఫీస్ వద్ద సునామీగా మారిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పఠాన్ వసూళ్ల ప్రభంజనం కొనసాగుతోంది. జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన షారుక్ ఖాన్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఎన్నాళ్ళ నుండో బాలీవుడ్ వారు వెయిట్ చేస్తున్న విజయం లభించింది అని సంబరాలు చేసుకుంటున్నారు.

దీపికా పడుకునె, జాన్ అబ్రహం ఇతర ప్రధాన తారాగణంతో తెరకెక్కిన పఠాన్ సినిమా అన్ని చోట్లా  అన్ని రకాల భాషల్లో మల్టీప్లెక్స్‌, సింగిల్ స్క్రీన్ తేడా లేకుండా భారీ వసూళ్లతో దూసుకుపోతోంది.బాలీవుడ్ బాద్షా షారూఖ్ ఖాన్ పఠాన్ చిత్రం తో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడు. ఈ చిత్రం తో మళ్లీ బాలీవుడ్ లో నమ్మకం కలిగేలా చేసాడు. ఇక తాజాగా జరిగిన మీడియా సమావేశంలో కూడా షారుఖ్ ఖాన్ దీపికా పదుకునే ఫుల్ జోష్ మూడ్ లో కనిపించారు.

ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా 696 కోట్ల గ్రాస్ వసూళ్ళు సాధించింది. ఇక ఈ రోజు  700 కోట్ల  మార్క్ ని అందుకుంది అని తెలుస్తోంది. ఇక ఈ వసూళ్ళలో ఇండియా నుంచే 436 కోట్లు రాగా ఓవర్సీస్ మార్కెట్ లో 31.85 డాలర్స్ తో 260 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా రాబట్టింది. మొత్తానికి అయితే పఠాన్ మాత్రం ఎక్కడా తగ్గకుండా సూపర్ వసూళ్ల తో దూసుకు పోతుంది. ఇక ఈ సినిమా విజయం తో దక్షిణాది దర్శకుడు అట్లీ తో చేస్తున్న సినిమా జవాన్ పై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి. బయ్యర్స్ డబ్భులు పెట్టడానికి విపరీతంగా ఎగబడుతున్నారు

 

 

Read more RELATED
Recommended to you

Latest news