తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు షాకింగ్ న్యూస్.. ఆ సబ్జెక్టు సిలబస్ లో మార్పులు..

-

తెలంగాణ ఇంటర్ బోర్డు మరో నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఇంగ్లిష్ సిలబస్ లో పూర్తిగా మార్పులు చేసినట్లు తెలిపారు.ఈ విషయం గురించి ఇంటర్ బోర్డు అధికారికంగా ప్రకటించారు.ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం కొత్త ఇంగ్లిష్‌ పుస్తకాలను విడుదల చేశారు. మారిసిన సిలబస్‌ 2022-23 విద్యా సంవత్సరం నుంచి అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు.

ఈ కొత్త సిలబస్ పుస్తకాలు త్వరలోనే మార్కెట్లోకి అందుబాటులోకి రానున్నాయని ఇంటర్‌ బోర్డ్‌ కార్యదర్శి ఉమర్‌ జలీల్‌ తెలిపారు. అయితే ఇటీవల ప్రకటించిన ఫలితాలత్లో ఫెయిలైన అభ్యర్థులకు పాత సిలబస్‌ ఆధారంగానే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు.

మార్చి 2023, మే 2023లో నిర్వహించే పరీక్షల్లో పాల్గొనే సెకండ్ ఇయర్ విద్యార్థులకు కొత్త సిలబస్‌ ప్రకారం పరీక్ష పేపర్‌ ఉండనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతీ ఐదేళ్లకు ఒకసారి సిలబస్‌లో మార్పులు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయం మేరకే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల 2019-2020 విద్యా సంవత్సరంలో ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌కి సంబంధించిన హ్యుమనిటీస్‌ సబ్జెక్టుల సిలబస్‌ను మార్చిన విషయం తెలిసిందే..

ఇదిలా ఉంటే ఇంటర్‌ బోర్డ్‌ తాజాగా సప్లిమెంటరీ పరీక్ష ఫీజుకు చెల్లింపు గడువును పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈనెల 8వ తేదీ వరకు విద్యార్థులు ఎలాంటి అదనపు ఫీ లేకుండా సప్లీ ఫీజులు చెల్లించుకోవచ్చని అధికారులు తెలిపారు..తల్లి దండ్రులు, కాలెజీల నుంచి వచ్చిన అభ్యర్థన వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news