షాకింగ్; దేశంలో రికార్డ్ 24 గంటల్లో 1684 కేసులు…!

-

భారత్ లో కరోనా తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. కరోనా కట్టడికి ఎన్ని చర్యలు తీసుకున్నా సరే కట్టడి మాత్రం అయ్యే పరిస్థితి లేదు. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో ఆందోళన కలిగించే విధంగా కేసులు నమోదు అయ్యాయి. భారత్‌లో గడచిన 24 గంటల్లో కొత్తగా 1684 కరోనా పాజిటివ్ కేసులు, 37 కరోనా మరణాలు నమోదు అయ్యాని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది.

కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఇప్పటి వరకు భారత్ లో కరోనా కేసులు 23 వేలు దాటాయి. మొత్తం 23,077 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. ఇక 718 మంది కరోనాతో మరణించారు అని చెప్పింది కేంద్రం. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 17610గా ఉంది. 4749 మంది పూర్తిగా కరోనా నుంచి కోలుకుని ఇంటికి వెళ్ళిపోయారు. మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కేసులు వేగంగా నమోదు అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news