సంగారెడ్డి లో కాల్పుల కలకలం.. చిన్న కారణానికే..!

-

ఈ మధ్యకాలంలో భూ తగాదాల నేపథ్యంలో జరుగుతున్న దారుణాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి అన్న విషయం తెలిసిందే. భూమి విషయంలో తలెత్తిన ఘర్షణలతో ఏకంగా ఒకరి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడడం లేదు. ఇక్కడ ఇలాంటి తరహా ఘటన చోటుచేసుకుంది. భూ తగాదాల నేపథ్యంలో జరిగిన కాల్పులు ఒక్కసారిగా కలకలం సృష్టించాయి. ఏకంగా నాలుగు రౌండ్లు కాల్పులు జరగడంతో స్థానికులు అందరూ ఒక్కసారిగా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

ఈ ఘటన సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలంలో చోటుచేసుకుంది. గోవిందా పూర్ శివారులో రెండు వర్గాల మధ్య భూమి విషయంలో ఘర్షణ జరిగింది ఈ క్రమంలోనే మాటా మాటా పెరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన ఓ వర్గం ఏకంగా తుపాకులతో కాల్పులు జరిపింది. నాలుగు రౌండ్లు కాల్పులు జరపడంతో అక్కడున్న వారందరూ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ కాల్పుల్లో ఎవరికీ ప్రాణ నష్టం జరగకపోవడంతో గమనార్హం. ఇక ఈ విషయం పై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి విచారణ జరుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news