ప్రభాస్ ఛాలెంజ్‌.. పూర్తిచేసిన శ్రద్ధా కపూర్‌..!

-

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనికి మంచి స్పందనే వచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ తారలు, రాజకీయ నాయకులు, ప్రముఖులు చాలా మంది ఈ ఛాలెంజ్‌ ను స్వీకరించారు. తాజాగా.. బాలీవుడ్‌ బ్యూటీ, సాహో ఫేమ్‌ శ్రద్ధా కపూర్‌ రెబల్‌స్టార్‌ ప్రభాస్‌ విసిరిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొంది.

బుధవారం ముంబైలోని తన నివాసంలో మొక్కను నాటింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా తెలిపింది. కార్యక్రమాన్ని ప్రారంభించి ముందుకు తీసుకెళుతున్న రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. కార్యక్రమానికి తనను నామినేట్‌ చేసిన ప్రభాస్‌కు ధన్యవాదాలు తెలిపింది.

Thank you Prabhas for nominating me for #GreenIndiaChallenge. I have planted few saplings. Special thanks to MP Santosh Kumar sir for this initiative. 🌱💜#HaraHaiTohBharaHai

Posted by Shraddha Kapoor on Wednesday, 16 September 2020

Read more RELATED
Recommended to you

Latest news