పెళ్లి అయిన వారానికే రోడ్డు ప్ర‌మాదంలో ఎస్ఐ మృతి

-

తెలంగాణ‌లోని వికారాబాద్ వ‌న్ టౌన్ లో ఎస్ ఐ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న శ్రీ‌ను నాయ‌క్ (30) రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించాడు. ఈ ఘ‌ట‌న న‌ల్ల‌గొండ జిల్లాలో జ‌రిగింది. వివ‌రాలు ఇలా ఉన్నాయి. రంగా రెడ్డి జిల్లా మాడుగుల మండ‌లం మాన్యా నాయ‌క్ తండా లో మాన్యా నాయ‌క్ (55) శ్రీ‌ను నాయ‌క్ ఉంటున్నారు. శ్రీ‌ను నాయ‌క్ వికారాబాద్ లోని వ‌న్ టౌన్ లో ఎస్ఐగా విధులు నిర్వ‌హిస్తున్నాడు. కాగ శ్రీ‌ను నాయ‌క్ కు వారం రోజుల ముందు వివాహం జ‌రిగింది. అయితే సొంతూరులో చిన్న ఫౌంక్ష‌న్ ఉండ‌టంతో తండ్రి మాన్యా నాయ‌క్ తో హైద‌రాబాద్ నుంచి సొంత గ్రామానికి వ‌చ్చారు.

కార్య‌క్ర‌మం అయి పోయిన త‌ర్వాత తిరిగి ఆటోలో హైద‌రాబాద్ కు వెళ్లారు. ఈ క్ర‌మంలో చింతప‌ల్లి మండ‌లం పోలెప‌ల్లి రాంన‌గ‌ర్ గ్రామం వ‌ద్ద ఆర్టీసీ బ‌స్సు ఆటోను ఢీ కొట్టింది. ఆ ఆటోలో ప్ర‌యాణిస్తున్న శ్రీ‌ను నాయ‌క్, మాన్యా నాయ‌క్ మృతి చెందారు. స్థానికుల స‌మాచారంతో పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకున్నారు. మృత దేహాల‌ను దేవ‌రకొండ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి పంపించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news