పాపం; మామ చేతిలోనే మేనల్లుడు మృతి, ఎలా అంటే…?

-

హైదారాబాద్ లో విషాద సంఘటన జరిగింది. మేన మామ చేతిలోనే మేనల్లుడు మరణించాడు. రోడ్డు దాటుతున్న సమయంలో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు కన్నీరు పెట్టిస్తుంది. వివరాల్లోకి వెళితే మాదాపూర్‌లోని జయభేరి సిలికాన్ టవర్స్ వద్ద సోమవారం 14 నెలల బాలుడిని అతడి మేనమామ ఎత్తుకొని రోడ్డు దాటుతున్నాడు. అయితే అతను సరిగా రోడ్డుని గమనించలేదు.

ఇంతలో ఒక వ్యక్తి స్కూటీపై వేగంగా వచ్చి బలంగా ఢీకొట్టడంతో, భవన నిర్మాణ కార్మికుడిగా పని చేస్తున్న బాలుడి మేనమామ రాజ్‌కుమార్ చేతుల్లో ఉన్న బాలుడు రోడ్డుపై ఎగిరిపడి 14 నెలల బాలుడు సతీష్ ఘటనా స్థలంలోనే తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో రాజకుమార్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. దీనిని గమనించిన స్థానికులు వెంటనే మేనమామను,

సమీపంలో ఉన్న ప్రవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. విచారణ చేపట్టిన పోలీసులు రాజ్‌కుమార్ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. మధ్యాహ్నం భోజన విరామ సమయంలో అతడు తన మేనల్లుడుని ఎత్తుకొని రోడ్డు దాటుతుండగా ఈ ఘటన జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news