స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ: సెమీస్ చేరిన తెలుగుతేజం పి వి సింధు… టైటిల్ సాధిస్తుందా !

-

ఈ సంవత్సరంలో మూడు నెలలు పూర్తి అయినా ఇంకా తెలుగు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పి వి సింధు ఇంకా ఈ టైటిల్ ను గెలుచుకోలేదు. తన ప్రయత్నంలో లోపం లేకపోయినప్పటికీ అదృష్టం కలిసి రాలేదు. కాగా ప్రస్తుతం స్పెయిన్ లో జరుగుతున్న స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ లో అయినా టైటిల్ ను సాధించాలన్న కసితో బరిలోకి దిగింది. తాజాగా ముగిసిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో తెలుగు తేజం పి వి సింధు వరుస సెట్ లలో తన ప్రత్యర్థి డెన్మార్క్ కు చెందిన బ్లిచ్ పెల్ట్ పై 21-14, 21 -17 తేడాతో విజయాన్ని నమోదు చేసింది.

ఈ విజయంతో సింధు సెమీ ఫైనల్ కు చేరుకుని టైటిల్ కు మరో రెండు అడుగుల దూరంలో మాత్రమే నిలిచింది. ఇక పురుషుల విభాగంలో కిధాంబి శ్రీకాంత్ జపాన్ కు చెందిన నిషిమోటో చేతిలో ఒడి టోర్నీ నుండి వైదొలిగాడు. మరి సెమీఫైనల్ లో సింధు మరింత చెలరేగి గెలవాలని కోరుకుందాం.. అలాగే ఈ సంవత్సరం మొదటి టైటిల్ ను ఈ స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ తోనే ఆరంభించాలని ఆశిద్దాం.. ఆల్ ద బెస్ట్ సింధు

Read more RELATED
Recommended to you

Latest news