సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్

-

తెలంగాణాలో మరో ఎమ్మెల్యే కరోనా బారిన పడ్డారు. సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఆయనతో పారు ఆయన భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కాసేపటికి క్రితం ర్యాపిడ్ టెస్ట్ చేయించుకున్న ఎమ్మెల్యేకి కరోనా అని తేలడంతో కుటుంబ సభ్యుల తో కలిసి ఐసోలేషన్ కు వెల్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకటన చేశారు. ఇక తనను కాంటాక్ట్ అయిన అందరినీ జాగ్రత్తగా ఉండాలని ఎమ్మెల్యే కోరారు.

ఇక తెలంగాణాలో కరోన కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈరోజు రికార్డు స్థాయిలో 3018 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,688కి చేరింది. ఇందులో 85,223 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 25,685 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో తెలంగాణలో కరోనా కారణంగా 10 మంది మరణించారు. దీంతో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 780 కి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news