రాజ్ కోటలో గ్రాండ్​గా స్మృతి ఇరానీ కూతురి పెళ్లి​

-

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షనెల్​ ఇరానీ తన ప్రియుడు అర్జున్ భల్లాతో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహ వేడుక రాజస్థాన్​ జోధ్​పుర్​లో 15వ శతాబ్దం నాటి ఖిన్వ్​సర్​ రాజకోటలో ఘనంగా జరిగింది. గురువారం రాత్రి 7.30 గంటల సమయంలో వధూవరులు పూలమాలలు మార్చుకున్నారు. ఆ సమయంలో రాజకోటపై బాణాసంచా కాల్చారు.

షనెల్​ పరిణయానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. షనెల్​ వివాహ వేడుకలకు వచ్చిన అతిథులకు రాజస్థాన్ సంప్రదాయ ఆచారాలతో స్వాగతం పలికారు. నో ఫోన్ విధానాన్ని అమలు చేశారు. వివాహ ప్రాంగణంలోకి ఎవరూ ఫోన్​ తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. కేంద్రమంత్రి కుమార్తె పెళ్లి సందర్భంగా రాజకోట పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు.

బుధవారం ఉదయం స్మృతి ఇరానీ.. జోధ్​పుర్​ చేరుకున్నారు. మాజీ మంత్రి ఖిన్వసార్.. స్మృతి ఇరానీ కుమార్తె పెళ్లి వేడుకల పూర్తి బాధ్యతలు తీసుకున్నారు. కాగా, స్మృతి ఇరానీ కుమార్తె షనెల్​కు అర్జున్​ భల్లాతో 2021 డిసెంబరులో నిశ్చితార్థం జరిగింది. ముంబయిలోని ప్రభుత్వ న్యాయ కళాశాలలో లా కోర్సు పూర్తి చేసిన షనెల్​.. ఆ తర్వాత వాషింగ్టన్​ డీసీలోని జార్జ్​టౌన్​ యూనివర్సిటీ నుంచి ఎల్​ఎల్​ఎమ్​ పట్టా పొందారు. షనెల్​ ఇరానీకి కాబోయే భర్త అర్జున్​ భల్లా కెనడాలో నివసిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news