స్మృతి ఇరానీ కుమార్తె రిసెప్షన్​లో సినీతారల సందడి.. ఫొటోస్ వైరల్

-

కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కుమార్తె షనెల్​ వెడ్డింగ్​ రిసెప్షన్ ముంబయిలో చాలా గ్రాండ్​గా జరిగింది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ ఫంక్షన్​లో స్పెషల్ అట్రాక్షన్​గా ‘క్యోంకీ సాస్​ బీ కబీ బహూ థీ’ యాక్టర్లు కనిపించారు.

ఇది రిసెప్షన్​లా కాకుండా ఈ సీరియల్​ రీయూనియన్​లా అనిపించింది. ఆ సీరియల్​ నిర్మాత ఏక్తా కపూర్​, నటులు రోనిత్​ రాయ్, మౌనీ రాయ్​తో పాటు పలువురు యాక్టర్లు.. రిసెప్షన్​కు సంబంధించిన చిత్రాలను సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశారు.

ఈ సీరియల్​లో స్మృతి ఇరానీ కీలకపాత్రలో నటించిన విషయం తెలిసిందే. రిసెప్షన్​లో స్మృతి ఇరానీ.. ఎరుపు రంగు చీరలో గ్రాండ్​ లుక్​లో కనిపించారు. కాగా, కేంద్రమంత్రి కుమార్తె షెనల్​.. ఈ నెల ఫిబ్రవరి 9న తన ప్రియుడు అర్జున్ భల్లాతో షనెల్​ ఏడడుగులు వేశారు. వీరి వివాహ వేడుక రాజస్థాన్​ జోధ్​పుర్​లో 15వ శతాబ్దం నాటి ఖిన్వ్​సర్​ రాజకోటలో ఘనంగా జరిగింది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news