అర్ధరాత్రి రెచ్చిపోయిన స్మగ్లర్లు..పోలీసులపై రాళ్లతో దాడి.

-

శేషాచలం అడవుల్లో అర్థరాత్రి స్మగ్లర్లు మరోసారి రెచ్చిపోయారు..కూంబింగ్‌ నిర్వహిస్తున్న టాస్క్‌ ఫోర్స్ పోలీసులపై దాదాపు 60 మంది పోలీసులపై రాళ్లతో విరుచుకుపడ్డారు. దీంతో ఆత్మరక్షణ కొరుకు పోలీసులు గాళ్లోలోకి రెండు రౌండ్ల కాల్పులు జరిపారు..లోడ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర చందనం దుంగలను వదిలి స్మగ్లర్లు పారిపోయారు..దాదాపు 51 దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు టాస్క్ ఫోర్స్ అధికారులు తెలిపారు. గత కొద్దీ రోజులుగా శేషాచలం అడవుల్లో అడవుల్లో కూంబింగ్ చేస్తుండగా, పక్కా సమాచారం తో స్మగ్లర్లు పై దాడి చేసినట్లు తెలిపారు. పారిపోయిన స్మగ్లర్ల కోసం కూంబింగ్ కోనసాగుతుందని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news