పైశాచికం.. బాలుడి మర్మాంగంపై టపాసులు కాల్చి.. ఆపై..!

-

హైదరాబాద్​లోని గండిమైసమ్మ గుడి ప్రాంతంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. 16 ఏళ్ల బాలుడిని పట్టుకుని మర్మాంగంపై టపాసులు పేలుస్తూ వీడియో తీసిన దారుణమైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉత్తర్​ప్రదేశ్​ ఖుషీనగర్​కు చెందిన 16 ఏళ్ల బాలుడిని.. బాసర గుడిలోని టపాసుల కర్మాగారంలో పని చేసేందుకు వారి బంధువులు మూడు నెలల క్రితం పంపించారు. కొన్ని రోజుల నుంచి ఆ బాలుడిని ఇబ్బందులకు గురిచేస్తున్న స్థానిక యువకులు దీపావళి పండుగ రోజున అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు.

కొందరు యువకులు కలిసి బాలుడిని కదలకుండా గట్టిగా పట్టుకున్నారు. తనను వదిలిపెట్టాలని అతడు ఏడుస్తూ బతిమాలినా కనికరించలేదు. ఆ బాలుడి మర్మాంగంపై టపాసులు పేలుస్తూ.. వీడియో తీసి పైశాచికానందానికి పాల్పడ్డారు. తర్వాత ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేశారు. బాధితుడి సెల్​ఫోన్ కూడా లాక్కున్నారు. వైరల్ వీడియో ద్వారా సమాచారం తెలుసుకున్న బాధితుడి తల్లిదండ్రులు.. ఘటనపై యూపీలోని ఖుషీనగర్​ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమారుడు మానసిన వైకల్యంతో ఇబ్బందిపడుతున్నారని తల్లింద్రుడులు చెప్పారు. దీనిపై స్థానిక పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం అందలేదని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news