తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న భారత్ జోడో యాత్ర

-

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర 56వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో ఈ యాత్ర కొనసాగుతోంది. తెలంగాణలో 8వ రోజు కొనసాగుతున్న యాత్ర బాలానగర్ నుంచి ప్రారంభమైంది. కూకట్​పల్లి నుంచి కేపీహెచ్​బీ జంక్షన్ వైపునకు సాగుతోంది. నిన్న రాత్రి బోయిన్‌పల్లిలోని గాంధీయన్ భావజాల కేంద్రంలో బస చేసిన రాహుల్.. నేడు బాలానగర్ నుంచి జోడో యాత్ర కొనసాగిస్తున్నారు.

హబీబ్ నగర్, ముసాపేట్, ఐడీఎల్ జంక్షన్, కూకట్ పల్లి, హఫీజ్ పేట్ మీదుగా ఈ యాత్ర సాగుతోంది. ఇవాళ ఉదయం 10 గంటలకు మియాపూర్ హోటల్ కినారా గ్రాండ్ వద్ద మార్నింగ్ బ్రేక్ తీసుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు బీహెచ్​ఈఎల్​ బస్ స్టాండ్ నుంచి తిరిగి యాత్ర ప్రారంభం అవుతుంది. రామచంద్రాపురం, పటాన్​చెరు వరకు పాదయాత్ర సాగనుంది. సాయంత్రం 7 గంటలకు ముత్తంగి వద్ద భారత్ జోడో యాత్ర కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. అనంతరం సంగారెడ్డి జిల్లా రుద్రారం గణేశ్​ మందిర్​లో రాహుల్ గాంధీ రాత్రి బస చేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news