ఏపీలో ఇక రూ.75 లకే లిక్కర్ ?

-

ప్రజాగ్రహ సభలో ఏపీ బిజేపి చీఫ్ శవము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో బిజేపి పార్టీ అధికారంలోకి వస్తే .. కేవలం రూ. 70కే ఛీప్ లిక్కర్ ఇస్తాం.. రెవెన్యూ బాగుంటే రూ. 50కే ఛీప్ లిక్కర్ అందిస్తామని సోము వీర్రాజు ప్రకటన చేశారు. సంక్షేమం పేరు తో జగన్ సంక్షోభం సృష్టిస్తున్నారని… చేతకాక అప్పులు చేస్తున్నారని ఫైర్ అయ్యారు.

జగన్ నవరత్నాలు ఇస్తున్నారేమో.. మేం 90 రత్నాలు ఇస్తామని ప్రకటన చేశారు. వైసీపీ నేతలకూ మందుల కంపెనీలున్నాయి.. ఆ సంస్థలకు భూములిచ్చేస్తున్నారని.. మేం వ్యాక్సిన్లు ఉత్పత్తి చేశామని తెలిపారు. కంట్రీకి నీచులు, అరిచే కుక్కలు అంటూ కమ్యూనిస్టులపై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనియన్లు పెట్టి పాఠశాలలను కమ్యూనిస్టులు సర్వనాశనం చేశారని.. నిప్పులు చెరిగారు.

ఇవాళ బీజేపీ పార్టీ సభలో ఏపీలో జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. కమ్యూనిస్ట్ పార్టీలు బూర్జువా పార్టీలు అని.. కమ్యూనిస్టులు బార్కింగ్ డాగ్స్ అంటూ నిప్పులు చెరిగారు. ట్రేడింగ్ పార్టీలకు కమ్యూనిస్టులు ఏజెంట్లు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version