బొల్లారం రాష్ట్రపతి విడిది గృహంలో కళా మహోత్సవాలు!

-

బొల్లారం రాష్ట్రపతి విడిది గృహంలో కళా మహోత్సవాలు జరగనున్నాయి. ఈనెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు సికింద్రాబాద్‌లోని బొల్లారం రాష్ట్రపతి నిలయంలో నిర్వహించనున్న ఈశాన్య రాష్ట్రాల కళా మహోత్సవాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభిస్తారని ప్రెసిడెంట్ హౌస్ కార్యనిర్వహణ అధికారి రజనీ ప్రియ వెల్లడించారు.

 

ఈశాన్య రాష్ట్రాల యొక్క జీవన విధానం, సంస్కృతి, సంప్రదాయాలు గురించి నేటి ప్రపంచానికి తెలియజేయడానికి ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు అధికారి తెలిపారు. అయితే, ఈ ఉత్సవాల్లో భాగంగా 28న ఉదయం నుంచే పలు రకాల స్టాల్స్ అందుబాటులోకి తెస్తామన్నారు. సాయంత్రం వేళ కళా ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.

 

అయితే, ఈ ఉత్సవాలను సందర్శించాలనుకునే వారు రాష్ట్రపతి నిలయం ఎంట్రీ గేటు వద్ద కౌంటర్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని లేదా https://rashtrapatibhavan.gov.in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి’అని ఆమె తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version