జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి సోము వీర్రాజు ఫిర్యాదు

-

జగనన్న ఇళ్ల నిర్మాణాలపై కేంద్రానికి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. కేంద్ర నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగడం లేదని ఫిర్యాదు చేశారు. ఇళ్ల నిర్మాణాల్లో పొరపాటు, అలసత్వం జరుగుతుందన్నారు. ఇళ్ల నిర్మాణానికి కేంద్రం నిధులు ఇస్తున్నప్పటికీ.. ప్రధాని ఆవాస్ యోజన అని బోర్డు పెట్టడం లేదని ఆరోపించారు.

వైసీపీ రంగులు వేసి వైసిపి ఇల్లుగా మార్చేస్తున్నారని మండిపడ్డారు. జగనన్న కాలనీ.. మోడీ అన్న ఇల్లు అని పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి స్వయంగా వచ్చి ఏపీలో ఇళ్ల పరిస్థితి చూడాలని కోరామన్నారు. పోలవరం, పంచాయతీల నిధుల విషయంలోనూ కేంద్రానికి నివేదిక ఇస్తామన్నారు సోము వీర్రాజు. కేంద్రం సర్పంచుల ఖాతాలలో వేసిన డబ్బులను కూడా రాష్ట్రం తన ఖాతాలలో వేసుకుందని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news