బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత కాంగ్రెస్ అధిష్టానం నష్ట నివారణా చర్యలకు దిగింది. పార్టీ అధినేత సోనియా గాంధీ ఇప్పుడు పార్టీ నేతల తీరుపై ఆగ్రహంగా ఉన్నారు. ఓటమి తర్వాత నేడు ఆమె మొదటిసారి కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో అగ్ర నేతలు ఎకె ఆంటోనీ, రణదీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, అంబికా సోని, కెసి వేణుగోపాల్ హాజరుకానున్నారు.

కరోనా నుంచి పూర్తిగా కోలుకున్న కాంగ్రెస్ అగ్రనేత అహ్మద్ పటేల్ కూడా హాజరు కానున్నారు. రుతుపవనాల సమావేశంలో పార్లమెంటు ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లుల గురించి కూడా చర్చిస్తారు. కాంగ్రెస్ పార్టీ నవంబర్ 19 న రైతుల 2 కోట్ల సంతకాలను రాష్ట్రపతికి సమర్పించే అవకాశం ఉంది. బీహార్ ఎన్నికల్లో మహాకూటమిలో కాంగ్రెస్ దారుణంగా ఫెయిల్ అయింది. దీనిపై ఆమె అగ్ర నేతల మీద సీరియస్ అవ్వడమే కాకుండా బీహార్ నేతల నుంచి నివేదిక కోరారు.