త్వరలో కేసీఆర్ జైలుకే.. పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

-

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మహబూబాబాద్ కాంగ్రెస్ జన జాతర సభలో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డిని కేసీఆర్ లిల్లిఫుట్ అంటున్నారని మండిపడ్డారు. కేసీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలన్నారు. దేశాన్ని పదేళ్లు ఏలిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణను దారుణంగా మోసం చేసిందని మండిపడ్డారు.

 

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారని కేసీఆర్ అంటున్నారు. ఆ మాట మాట్లాడేందుకు కేసీఆర్ కి సిగ్గుండాలన్నారు. పదేళ్లలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. తాము ఒక్కొక్కటిగా సరి చేసుకుంటూ వస్తున్నామన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి అందరి స్వేచ్ఛను హరించారని మండిపడ్డారు. త్వరలో కేసీఆర్ జైలుకు వెళ్తారని మంత్రి పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news