FLASH : ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం భార్యకు కరోనా..!

-

కరోనా మహమ్మారి ప్రభావం సినీ రంగంపై తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులు దీని బారిన పడగా.. తాజాగా ప్రముఖ లెజండరీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన ఆయన చెన్నైలోని ఓ కార్పోరేట్ హాస్పిటల్‌లో కోవిడ్‌కు చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆయన ఆరోగ్యం బాగా క్షీణించడంతో నిన్న రాత్రి ఐసీయూకి తరలించారని వార్తలు వచ్చాయి.

అయితే ఈ వార్తలను ఆయన కొడుకు కొట్టిపారేశారు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. అయితే తాజాగా ఇప్పుడు సతీమణి సావిత్రి బాల సుబ్రహ్మణ్యం కూడా కరోనా వైరస్ బారిన పడ్డారు. బాలసుబ్రహ్మణ్యం పాజిటివ్ రావడతో కుటుంబ సభ్యులకు టెస్టులు నిర్వహించారు. దీంతో బాలు సతీమణి సావిత్రికి పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news