BIG BREAKING : మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ కన్నుమూత

-

మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ కన్నుమూశారు. UP మాజీ ముఖ్యమంత్రి, సమాజ్ వాది పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ కన్నుమూశారు. కాసేపటి క్రితమే ఈ విషయాన్ని సమాజ్ వాది పార్టీ అధికారికంగా ప్రకటించింది.

గత కొన్ని రోజులుగా గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో వెంటిలేటర్ పైన చికిత్స పొందుతున్న ములాయం, ఆరోగ్యం మరింత క్షీణించడంతో తుది శ్వాస విడిచారు. శ్వాస కోస సమస్యలతో ఆసుపత్రిలో చేరిన ములాయం కిడ్నీ, యూరిన్ ఇన్ఫెక్షన్లతో కూడా బాధపడుతున్నారు. ములాయం కేంద్ర రక్షణ మంత్రిగా, 3 టర్మ్ లు యుపి సీఎంగా సేవలు అందించారు.

Read more RELATED
Recommended to you

Latest news