కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీని కలిసిన స్పీకర్ గడ్డం ప్రసాద్‌

-

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. వికారాబాద్ నియోజకవర్గానికి సంబంధించిన పలు జాతీయ రహదారుల పనులపై ఆయన నితిన్ గడ్కరీతో చర్చలు జరిపారు. అసెంబ్లీ స్పీకర్‌తో పాటు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌లు కూడా కేంద్ర మంత్రిని కలిసిన వారిలోఉన్నారు.

వికారాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు అనుసంధానంగా ఉన్న జాతీయ రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని ఈ సందర్భంగా కోరారు. అందుకు అవసరమైన నిధులను వెంటనే విడుదల చేసేలా చూడాలని కేంద్రమంత్రి గడ్కరీకి వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి సంబంధించిన పలు పెండింగ్ ప్రాజెక్టులను కూడా పూర్తి చేయాలని తెలంగాణ ఎంపీలు కోరినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news