లంచ్ బ్రేక్ సమయానికి బంగ్లా స్కోర్ ఎంతంటే..?

-

భారత్‌తో ఇండోర్ వేదికగా గురువారం ఆరంభమైన తొలి టెస్టు మ్యాచ్‌లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ కెప్టెన్ మొమినుల్ హక్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. టీమిండియా వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు లంచ్ బ్రేక్ సమయానికి 3 వికెట్ల నష్టానికి 63 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ జట్టు 12 పరుగులకే ఓపెనర్ల వికెట్లను కోల్పోయింది.

ఆ తర్వాత క్రీజులోకొచ్చిన మహ్మద్ మిథున్ కూడా 13 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. దీంతో మూడు కీలక వికెట్లను బంగ్లా జట్టు చేజార్చుకుంది. ప్రస్తుతం కెప్టెన్ మోమినుల్‌ హక్‌(22), ముష్ఫికర్ రహీమ్(14) పరుగులు చేసి క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, షమీకి తలో వికెట్ దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news