T20 World Cup : టీమ్ ఇండియాకు అమితాబ్ బచ్చన్ స్పెషల్ మెసేజ్

-

మరికొద్ది రోజుల్లో పొట్టి కప్పు (T20 World Cup 2024) మహా సమరం ప్రారంభం కానున్న నేపథ్యంలో టీమ్‌ఇండియాకు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ప్రత్యేక మెసేజ్ అందించారు. తన కొత్త సినిమా ‘కల్కి 2898 ఎ.డి’లోని అశ్వత్థామ అవతారంలో వచ్చి బిగ్‌బీ క్రికెటర్లలో జోష్ నింపారు. ‘ఇది మహాయుద్ధం.. మీరంతా సిద్ధం కండి’ అంటూ స్ఫూర్తిని కలిగించారు. ఇందుకు సంబంధించిన వీడియోను చిత్రబృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ‘టీ20 ప్రపంచకప్‌ 2024 కోసం శంఖనాదం మోగింది’ అంటూ దీన్ని ప్రత్యేకంగా రూపొందించారు.

‘‘ఇది మహా యుద్ధం. గొప్ప పోరాటం. విజయం ముందు మీరు తలవంచొద్దు. ధైర్యంగా ఉండండి.. మీ సామర్థ్యాన్ని ప్రదర్శించండి.. బలాన్ని చూపండి..! ప్రతి తల్లి గర్వపడేలా చేయండి. శత్రువు కళ్లలోకి కళ్లు పెట్టి చూడండి. అప్పుడు దేశం కోసం మీరు సిద్ధమవుతారు’’ అని బిగ్‌బీ క్రికెటర్లకు పిలుపునిచ్చారు. ఇందులో అశ్వత్థామగా అమితాబ్‌ క్రికెటర్లలో ప్రేరణ నింపేలా మాట్లాడుతుండగా.. బ్యాగ్రౌండ్‌లో ‘కల్కి’ సినిమా మ్యూజిక్‌ వినిపించింది.

Read more RELATED
Recommended to you

Latest news