Arshdeep singh : చివరి ఓవర్ లో 27 రన్స్…అర్షదీప్ పై ట్రోలింగ్

-

వన్డే సిరీస్‌ గెలిచిన టీమిండియా.. టీ 20ల్లో మాత్రం చతికల పడింది. కివీస్ తో జరిగిన తొలి టీ20 లో టీమిండియా 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. 177 రన్స్ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 155 రన్స్ మాత్రమే చేయగలిగింది.

సూర్య కుమార్ (47), హార్దిక్ పాండ్యా (21), సుందర్‌ (50) మినహా మిగతా అందరూ విఫలమయ్యారు. గిల్ 7, ఇషాన్ 4, రాహుల్ త్రిపాటి 0, దీపక్ కూడా 10 రన్స్ కే అవుట్ అయ్యారు. చివరి వరకు సుందర్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. అయితే, ఈ మ్యాచ్‌ లో అర్షదీప్‌ సింగ్‌ చెత్త రికార్డు నమోదు చేశాడు. ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ లో ఏకంగా 27 పరుగులు ఇచ్చాడు అర్షదీప్‌. దీంతో టీమిండియా ఓటమికి కారణమయ్యాడు.

Read more RELATED
Recommended to you

Latest news