టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు ముందు ఇండియాకు గుడ్ న్యూస్…

-

ఇండియా క్రికెట్ జట్టు జూన్ మొదటి వారంలో ఆస్ట్రేలియాతో ఇంగ్లాండ్ లోని లార్డ్స్ మైదానంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ ను ఆడనుంది. కాగా ఈ మ్యాచ్ కు ఇప్పటికే ఇండియాలో కీలక ప్లేయర్ లుగా ఉన్న కొందరు గాయాల కారణంగా దూరం అయ్యారు. ఇక ఈ మధ్యనే ఐపీఎల్ ఆడుతున్న అశ్విన్ కు కూడా వెన్ను నొప్పి కారణంగా బాధపడుతున్నాడన్న వార్తలు రాగానే.. ఇక ఇతను కూడా దూరంగా అవుతాడా అన్న ఆందోళనలో టీం ఇండియా ఉంది. కానీ తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం అశ్విన్ వెన్నునొప్పి నుండి పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ కూడా తిరిగి సాధించాడట. దీనితో అశ్విన్ ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఆడుతాడని తేలిపోయింది.

కాగా రీసెంటుగా రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన అశ్విన్ పెద్దగా రాణించలేదు అనే చెప్పాలి. దీనితో రాజస్థాన్ కనీసం ప్లే ఆఫ్ కు కూడా చేరకుండా ఇంటి దారి పట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news