T20 WC : ఆసీస్ కు బిగ్ షాక్..కరోనాతో ఆడం జంపా ఔట్

-

T20 WC : ప్రపంచ కప్‌ ఆతిథ్య జట్టు ఆసీస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ జట్టులో కరోనా కలకలం రేపింది. తాజాగా నిర్వహించిన కరోనా పరీక్షల్లో ఆడం జంపాకు కరోనా పాజిటివ్‌ గా నిర్ధారణ అయింది. దీంతో.. జట్టు ఇవాళ ఆగబోయే మ్యాచ్‌ కు దూరం అయ్యాడు.

ప్రస్తుతం ఆడం జంపా ఐసోలేషన్‌ లో ఉన్నాడు. కాగా.. ఇవాళ ఆసీస్‌, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్‌ జరుగనుంది. ఈ నేపథ్యంలోనే.. ఆతిథ్య జట్టు ఆసీస్ జట్టులో కరోనా కలకలం రేపింది. ఆడం జంపాకు కరోనా సోకడంతో.. మిగతా సభ్యులంతా ఆందోళన చెందుతున్నారు. ఇక ఆడం జంపాతో సన్నిహితంగా ఉన్న ప్లేయర్లంతా.. ఐసోలేషన్‌ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news