సెంచరీతో ఫామ్‌లోకి బాబర్..రికార్డ్ భాగస్వామ్యంతో ఇంగ్లాండ్‌పై ఘనవిజయం

-

పాకిస్తాన్ ఓపెనర్లు బాబర్ అజం, మహమ్మద్ రిజ్వాన్ టి20లో మరోసారి సంచలనం సృష్టించారు. ఇండియా తో జరిగిన మ్యాచ్ లో 152 రన్స్ టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా ఈ జోడి చేజ్ చేసిన విషయం తెలుసు కదా. మరోసారి దానిని రిపీట్ చేశారు. అయితే ఈసారి మరింత ఘనంగా, ఏకంగా 200 రన్స్ టార్గెట్ ను వికెట్ కోల్పోకుండా చేజ్ చేయడం విశేషం.

ఇంగ్లాండు తో గురువారం జరిగిన మ్యాచ్ లో ఈ ఇద్దరు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో ఈ మ్యాచ్ ను 10 వికెట్లతో గెలిచి 7 టి20 సిరీస్ ను 1-1 తో సమం చేసింది పాకిస్తాన్. తొలి మ్యాచ్ లో ఓటమి తర్వాత ఈ మ్యాచ్ కు చాలా బలంగా పుంజుకున్నా ఆ టీము, ఇంగ్లాండుకు షాక్ ఇచ్చింది. బాబర్ అజం 66 బాల్స్ లోనే 110 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. అటు రిజ్వాన్ 51 బాల్స్ లో 88 రన్స్ చేశాడు. దీంతో పాకిస్తాన్ 19.3 ఓవర్లలో వికెట్ కోల్పోకుండానే 203 రన్స్ చేసి విజయం సాధించింది.

Read more RELATED
Recommended to you

Latest news