చంద్రబాబు లెక్క తేల్చేందుకే జగన్ కుప్పం వచ్చారు – మంత్రి రోజా

-

చంద్రబాబు లెక్క తేల్చేందుకే సీఎం జగన్ కుప్పంకు వచ్చారని అన్నారు ఏపీ పర్యటక శాఖ మంత్రి ఆర్కేే రోజా. ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పథకమైన, అభివృద్ధి కార్యక్రమమైన చంద్రబాబు చేశారా? అని ప్రశ్నించారు. వైయస్సార్, జగన్ మాత్రమే ప్రజలకు మంచి చేశారని తెలిపారు. చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎగిరెది జగనన్న జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు, లోకేష్ కుప్పంలో వీధి వీధి తిరిగిన ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో టిడిపిని ఓడించారని అన్నారు.

30 ఏళ్లలో చంద్రబాబు చేయనిది సీఎం జగన్ మూడేళ్లలో చేసి చూపించారని తెలిపారు. ఇది కుప్పమా.. పులివెందుల అన్నట్లుగా జగన్ పర్యటన సాగుతుందన్నారు. కుప్పం రంగు మారిందన్నారు మంత్రి రోజా. వైయస్సార్ చేయూతతో మహిళల జీవితాలలో సీఎం జగన్ వెలుగులు నింపారని కొనియాడారు. నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news