BREAKING : వరల్డ్ కప్ లో న్యూజిలాండ్ తరపున ట్రెంట్ బౌల్ట్ ఆడుతాడు !

-

న్యూజిలాండ్ క్రికెటర్ ట్రెంట్ బౌల్ట్ 2023 సంవత్సరానికి సంబంధించి ఇచ్చిన జాతీయ కాంట్రాక్టు ను బౌల్ట్ తిరస్కరించాడు. ఆ తర్వాత ట్రెంట్ బౌల్ట్ ఇండియాలో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ లో ఆడుతాడా లేదా అన్న అనుమానం చాలామందికి ఉంది. అయితే తాజాగా ఆ దేశ క్రికెట్ బోర్డు శుభవార్తను బౌల్ట్ అభిమానులకు అందించింది. బౌల్ట్ తో జట్టు యాజమాన్యం చర్చించిన అనంతరం బౌల్ట్ అంగీకరించాడని తెలుస్తోంది. అక్టోబర్ లో జరుగనున్న వన్ డే వరల్డ్ కప్ లో బౌల్ట్ ఖచ్చితంగా ఆడుతాడు అని కివీస్ మేనేజ్మెంట్ సీఈఓ ఒక ప్రకటనలో తెలిపారు.

 

 

 

బౌల్ట్ చివరగా దేశం తరపున ఆడిన మ్యాచ్… 2022 లో జరిగిన టీ 20 వరల్డ్ కప్ లో ఆడిందే కావడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఫాస్ట్ బౌలర్ రాజస్థాన్ రాయల్స్ తరపున ఐపీఎల్ లో ఆడుతున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news